సిగ్గు, లజ్జ ఉందా? కిషన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

by  |
KCR
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లి ధాన్యం కొనుగోలు గురించి అడిగితే మీకేం పనిలేదా అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారని, సిగ్గు, లజ్జ ఉంటే కిషన్ రెడ్డి, గోయల్ కళ్లు తెరవాలన్నారు. పీయూష్ గోయల్ కూడా సిగ్గు లేకుండా మాట్లాడారని చెప్పారు.

ఆకలి సూచీలో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కన్నా ఘోరంగా ఉన్నామని, ప్రపంచ ఆకలి సూచీలో ఇండియా 101వ స్ధానంలో ఉందన్నారు. రైతులు, పేదలు బాగుపడాలంటే బీజేపీ సర్కార్ పోవాలని, బీజేపీ హయాంలో దేశంలో ఆకలి కేకలు పెరిగాయన్నారు.

Read more

యాసంగి ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ సంచలన ప్రకటన

ఫ్రీగా డబ్బులు ఇస్తాం.. తీసుకోండి! కస్టమర్లకు బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థల ఆఫర్


Next Story