- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బ్రేకింగ్ న్యూస్.. మునుగోడు ఫలితం రోజే బీఆర్ఎస్పై కేసీఆర్ కీలక ప్రకటన

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితి గా మారుస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని ప్రకటన చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్కు ఇప్పటికే ఆ పార్టీ దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలియజేయాలని 30 రోజుల గడువు ఇచ్చింది. ఆ అభ్యంతరాలను నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలని పార్టీ అధ్యక్షుడు హోదాలో కేసీఆర్ ఇంగ్లీషు, హిందీ పత్రికల్లో ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్రితం ఈ ప్రకటన విడుదల చేసినందున నెల రోజుల గడువులో నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్ పొలిటికల్ పార్టీ విభాగం సెక్రటరీకి తెలియజేయాలని ఆ ప్రకటనలో అప్పీల్ చేశారు.
పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారుస్తూ జనరల్ బాడీ సమావేశం దసరా పండుగ రోజున ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ మరుసటి రోజునే కేంద్ర ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేశారు. అయితే లాంఛనంగా ఈ పేరు మార్పు వ్యవహారం ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఫుల్ బెంచ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఒక కమిషన్ పోస్టు ఖాళీగా ఉన్నందున నెల రోజులు దాటిన ఎలక్షన్ కమిషన్ నుంచి అప్రూవల్ రాలేదు. ఇదే సమయంలో రెండు రోజుల క్రితం ఒక ఇంగ్లీషు, ఒక హిందీ పత్రికలో పార్టీ అధినేతగా కేసీఆర్ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇంగ్లీషు పత్రిక హిందుస్తాన్ టైమ్స్ లో, హిందీలో నవభారత్ టైమ్స్ పత్రిలో ప్రకటనలు విడుదలయ్యాయి. బీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే పలు పార్టీలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి టీఆర్ఎస్ నేతలకు సమాచారం ఉన్నది.
దీనిపై ఎలక్షన్ కమిషన్ అధికారుల నుంచి టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ క్లారిఫికేషన్ తీసుకున్నారు. పార్టీ పేరు అబ్రివేషన్లతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి పేరును మాత్రమే కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని వివరించారు. ఇప్పటివరకు భారత్ రాష్ట్ర సమితి పేరుతో ఎలాంటి పార్టీ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ కానందున టీఆర్ఎస్ పేరు మార్పు వ్యవహారానికి వచ్చిన చిక్కులేమీ లేవని స్పష్టం చేశారు. మరోవైపు అభ్యంతరాలుంటే ప్రజల నుంచి స్వీకరించడానికి స్వయంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ పత్రికల్లో ప్రకటనల ద్వారా అప్పీల్ చేశారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన రోజునే ఈ ప్రకటనను పత్రికలకు ఇవ్వడం గమనార్హం.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే బీఆర్ఎస్ పేరుతో పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. నెల రోజుల వ్యవధిలో ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ముగ్గురు కమిషనర్లు అప్రూవల్ చేయడానికి సమయం పట్టే అవకాశమున్నది. అప్పటికల్లా ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ల గడువు పూర్తవుతుంది. దీంతో టీఆర్ఎస్ పేరుతో పోటీ చేయడమో లేక స్వతంత్ర అభ్యర్థులుగా లేదా అక్కడి పలు ప్రాంతీయ పార్టీల పేరుతో పోటీ చేయడమో.. ఇలాంటి చర్చలు ఇప్పుడు టీఆర్ఎస్లో జరుగుతున్నాయి.