గిరిజనుల భూమి హక్కు పత్రాల పంపిణీ వాయిదా

by  |
గిరిజనుల భూమి హక్కు పత్రాల పంపిణీ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా విజృంభిస్తుండటంతో ఆదివాసీలకు భూమి హక్కు పత్రాలను పంపిణీని వాయిదా వేశామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2కు వాయిదా వేశామన్నారు. గిరిజన జాతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ మేరకు ఆదివాసీ దినోత్సవం(tribal day) సందర్భంగా సీఎం ట్వీట్ చేశారు. గాంధీ జయంతి రోజున కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపన, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన వర్సిటీకి భూమి పూజ చేస్తామని సీఎం వెల్లడించారు. అలాగే ఐటీడీఏల పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులనూ ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు.



Next Story