ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. నిధులు విడుదల

by  |
ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. నిధులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ రైతు భరోసా కింద మొదటి విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వర్చవల్ విధానంలో రైతుల అకౌంట్‌లోకి నగదు వేశారు. తొలి విడతలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ. 7,500 జమ అయ్యాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 52.38 లక్షల మంది రైతులకు రూ. 3,928 జమ చేశామని స్పష్టం చేశారు. రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో మూడో ఏడాదికి తొలి విడత సాయం చేసినట్టు ఆయన వెల్లడించారు. రైతన్నలకు తోడుగా నిలబడేందుకు నిధులను విడుదల చేస్తున్నామని.. గత ప్రభుత్వం పెట్టిన విత్తన బకాయిలను కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు.


Next Story

Most Viewed