టీఆర్ఎస్ లీడర్లను గ్రామాల్లో తిరగనివ్వం: భట్టి

by  |
టీఆర్ఎస్ లీడర్లను గ్రామాల్లో తిరగనివ్వం: భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త వ్యవసాయ చట్టాలను తెలంగాణలో అమలు చేస్తే టీఆర్ఎస్ లీడర్లను గ్రామాల్లో తిరగనివ్వమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ఒకరోజు దీక్షలో భట్టి విక్రమార్క మాట్లాడారు. కొత్త చట్టాలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదముందున్న భట్టి.. రైతులకు మద్దతు ధర విషయంలో సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకోవడంపై మండిపడ్డారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రూ.4లక్షల విరాళాలు సేకరించామని, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలను కలిపి ఇస్తామని భట్టి తెలిపారు.


Next Story

Most Viewed