పెద్దపల్లిలో నిద్ర మత్తుకు నిండు ప్రాణం బలి..

by  |
పెద్దపల్లిలో నిద్ర మత్తుకు నిండు ప్రాణం బలి..
X

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా పెద్ద కల్వల డిగ్రీ కళాశాల సమీపంలో ఆగి ఉన్న లారీని డీసీఎం వ్యాన్ ఢీకొట్టగా క్లీనర్ తిరుపతి (35) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకివెళితే.. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పెద్ద కల్వల డిగ్రీ కళాశాల సమీపంలో AP 15 Y 4635 లారీ పార్కింగ్ చేసి ఉండగా ఖమ్మం నుంచి బ్రెడ్ అన్ లోడింగ్ చేసి మంచిర్యాలకు వెళుతున్న TS 19 T 6214 డీసీఎం వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారుకున్నాడు.

కంటి రెప్ప ఆర్పి లేచే సరికి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ వెనుక భాగంలో వేగంగా ఢీ కొట్టింది. ఎడమ భాగాన ఢీ కొనడంతో క్లీనర్ బి.తిరుపతి నర్సాపూర్ సీసీ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ బనేష్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు విచారణ అనంతరం చర్యలు చేపడుతామన్నారు.


Next Story

Most Viewed