‘డ్యూడ్’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన కీర్తిశ్వరన్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆ స్టార్ హీరోతోనే అంటూ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-09 11:44:07  IST  )

హీరో శింబు కోసమే స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.

‘డ్యూడ్’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన కీర్తిశ్వరన్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆ స్టార్ హీరోతోనే అంటూ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: కీర్తీశ్వరన్ ‘డ్యూడ్’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. ఈ సినిమా విడుదలై దాదాపు ఆరు నెలలు కావస్తున్నా, థియేటర్లలో దీనికి వచ్చిన రెస్పాన్స్ పట్ల కీర్తీశ్వరన్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితమంతా కేవలం ఆ ఒక్క సినిమా కోసమే ఉద్దేశించబడిందేమో అనేంతగా ఆ చిత్రం తనపై ప్రభావం చూపిందని ఆయన అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్ట్‌ ‘డ్యూడ్ 2’ సీక్వెల్‌ గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇటీవల తాను హీరో ప్రదీప్ రంగనాథన్‌ను కలిసి ఒక కొత్త లైన్ చెప్పినట్లు కీర్తీశ్వరన్ తెలిపారు. ఆ ఐడియా ప్రదీప్‌కు బాగా నచ్చిందని, అందులో ‘డ్యూడ్’ సినిమాకు సంబంధించిన ఆత్మ దాగుందని పేర్కొన్నారు.

ఒకవేళ అంతా అనుకున్నట్లు కుదిరి ఆ కథ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే.. దానిని ‘డ్యూడ్ 2’ గానే రూపొందిస్తామని స్పష్టం చేశారు. అలాగే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఒక అద్భుతమైన మాస్ అంశాలు, బలమైన భావోద్వేగాలతో కూడిన కథను రాస్తున్నట్లు కీర్తీశ్వరన్ వెల్లడించారు. ఈ పవర్‌ఫుల్ కథకు ఒక పెద్ద స్టార్ అవసరమని, అందుకే తాను ఎప్పటి నుంచో ఎవరితోనైతే పనిచేయాలని అనుకుంటున్నారో.. ఆ స్టార్ హీరో శింబు కోసమే ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ కథా చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని దర్శకుడు కీర్తీశ్వరన్ క్లారిటీ ఇచ్చారు.

‘మకుటం’ టీజర్ అప్డేట్ ఇచ్చిన విశాల్.. 30 ఏళ్ల కల నిజం కాబోతోందంటూ ఎమోషనల్ పోస్ట్

Next Story