- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘సుశాంత్ కేవలం ఒక్క రోజులోనే కొరియోగ్రఫీని నేర్చుకున్నాడు’.. దివంగత నటుడిపై జిమ్ సర్బ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, వెబ్డెస్క్: దివంగత నటుడు సుశాంత్ సింగ్పై జిమ్ సర్బ్ తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. జిమ్ సర్బ్.. సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కలిసి పనిచేసిన సమయాన్ని పంచుకున్నారు. మారిషస్లో షూటింగ్ లో ఒక యాక్షన్ సన్నివేశంలో తన మణికట్టు విరిగిందని.. అప్పుడు ఆ ప్రమాదంలో సుశాంత్ తప్ప తనతో మరెవరు లేరని వెల్లడించారు. జిమ్ బ్యాంకాక్లో రోజుల తరబడి శిక్షణ పొందినప్పటికీ, సుశాంత్ కేవలం ఒక రోజులోనే కొరియోగ్రఫీని నేర్చుకున్నాడని చెప్పుకొచ్చాడు.సుశాంత్ సింగ్ యాక్షన్లో నిజంగా ఉత్తమ నటుడు అని కొనియాడాడు.
అతని శారీరక నియంత్రణ అద్భుతమైనదని తెలిపాడు. డ్యాన్స్, నటన, అతని వైఖరి ప్రతీది సూపర్ అని చెప్పారు. జిమ్ సుశాంత్ ఎంత క్రమశిక్షణతో ఉన్నాడో కూడా పంచుకున్నాడు. కఠినమైన ఫిట్నెస్ దినచర్యను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పుకొచ్చాడు. పాత్ర కోసం అత్యుత్తమ ఫామ్లో ఉండటానికి ఐదు నెలలు రొట్టెలు తినడం మానేశాడని జిమ్ సర్బ్ వెల్లడించారు. ప్రస్తుతం జిమ్ సర్బ్ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020 జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో మరణించిన విషయం తెలిసిందే. ఇది చాలా వివాదాస్పదంగా మారింది. ముంబయి పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించారు. కానీ కేసు తర్వాత CBI కి అప్పగించారు. CBI సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సుశాంత్ మరణానికి దారితీసిన నేరపూరిత కుట్ర లేదా తప్పులు బయటపడలేదని తేల్చింది.
ఇకరియా చక్రవర్తిపై వచ్చిన ఆరోపణలు, సుశాంత్ తండ్రి ఫిర్యాదు.. సుశాంత్ కుటుంబం ఆరోపణలను పరిశీలించిన తర్వాత, CBI మూసివేత నివేదికను దాఖలు చేసింది. CBI నివేదిక ప్రకారం.. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని.. అతని మరణం వెనుక ఎటువంటి నేరపూరిత కుట్ర లేదని నిర్ధారించారు.