రోడ్డు ప్రమాదంలో సీఐ మృతి.. హత్యా, ప్రమాదమా ?

by  |
రోడ్డు ప్రమాదంలో సీఐ మృతి.. హత్యా, ప్రమాదమా ?
X

దిశ,ఉత్తరాంధ్ర : గుర్తు తెలియని వాహనం ఢీ కొని త్రీటౌన్ సీఐ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఎండాడ వద్ద గురువారం తెల్లవారు జామున పోలీస్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో సీఐ ఈశ్వరరావు అక్కడికక్కడే మరణించగా కానిస్టేబుల్ సంతోష్‌కు తీవ్రగాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని యాక్సిడెంట్ చేసి పరారైన వాహనంను గుర్తించేందుకు ఘటనాస్థలికి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక నగర కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed