ఖమ్మంలో క్రైస్తవ సంఘాల రాస్తారోకో.. భారీగా ట్రాఫిక్ జామ్

by  |
Dharna1
X

దిశ, పాలేరు: తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం గ్రామం వద్ద ఖమ్మం -వరంగల్ ప్రధాన రహదారిపై పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. క్రైస్తవ దేవాలయ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని అట్టిభూమిని తిరిగి క్రైస్తవులకు అప్పగించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు మాదిరిపురం వద్దకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed