ఇన్నేళ్లలో ఎప్పుడైనా మా వద్దకు వచ్చారా?

by  |
ఇన్నేళ్లలో ఎప్పుడైనా మా వద్దకు వచ్చారా?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, నగర ప్రజాప్రతినిధులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం చర్లపల్లి డివిజన్‌లో వరదసాయం పంపిణీ చేయడానికి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు మేయర్‌ను నిలదీశారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా తమ వద్దకు వచ్చారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తమ డివిజన్‌లో అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని కాలనీ వాసులు మేయర్‌ను నిలదీశారు. వరదసాయం కూడా తమకు సరిగా అందలేదని వారు చెప్పారు. దీంతో ఒక్కసారిగా కాలనీ వాసులంతా మేయర్‌పై ఫైర్ కావడంతో ఆయనకు ఏం చేయాలో తెలియక అయోమయానికి గురయ్యారు.


Next Story

Most Viewed