- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సౌత్ ఏషియన్ టార్గెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలకు చర్ల గిరిజన విద్యార్థులు

దిశ, చర్ల: వచ్చే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లోని ధారా పట్టణంలో జరిగే సౌత్ ఏషియన్ టార్గెట్ బాల్ చాంపియన్ షిప్లో పాల్గొనడానికి చర్ల పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులు ఇద్దరు ఎంపికయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప గ్రామానికి చెందిన ఎస్. సాయి వినయ్ 7వ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపర్చి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కాగా.. బోదనెల్లి గ్రామానికి చెందిన ఐ. అనిత కూడా 8వ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనపర్చి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. ఈ ఇద్దరు ఉత్తరప్రదేశ్లో జరిగిన గిరిజన జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలలో తమ సత్తా చాటారు.
ఈ ఇద్దరు విద్యార్థులను భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు అభినందించారు. గిరిజన సంక్షేమశాఖ నుంచి ఇంతవరకు ఈ ఈవెంట్ నందు అంతర్జాతీయ స్థాయిలో ఎవరూ పాల్గొనలేదన్నారు. మొదటిసారిగా టార్గెట్ బాల్ పోటీలలో పాల్గొంటున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.