- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఓ ఆలయంలో పూజల నిర్వహణకు కొద్దిమందికే అనుమతి ఉండగా, వందల సంఖ్యలో భక్తులు గుమిగూడారు. అనంతరం గుడి గేట్లు ధ్వంసం చేశారు. అనుమతి లేకున్నా రథయాత్ర నిర్వహించడానికి యత్నించారు. ఈ కేసులో సుమారు 50 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. డీఎస్పీ సంగీత అందించిన వివరాల ప్రకారం, దొతిహాల్ గ్రామంలో ప్రతియేటా నిర్వహించే పూజలకు కొద్దిమందికి మాత్రమే తహశీల్దార్ అనుమతినిచ్చారు.
లాక్డౌన్ కారణంగా తక్కువమందితోనే గుడి లోపల పూజలు జరుగుతుండగా, బయట సుమారు 50 మంది గుమిగూడటంతో ఓ మెటల్ గ్రిల్ను గేటులాగా అడ్డం పెట్టారు. కానీ, బయట మంది పెరిగారు. నిషేధాజ్ఞలున్నప్పటికీ గేట్లను ధ్వంసం చేసి రథయాత్రను నిర్వహించడానికి యత్నించారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీ చార్జీచేయాల్సి వచ్చింది. చాలా మంది గ్రామస్తులు పారిపోయారు. సీసీటీవీ ఫుటేజీ సహకారంతో 50 మంది నిందితులను అరెస్టుచేశారు.