గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి గుడ్‌న్యూస్

by Disha Web Desk 17 |
గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే బీసీ అభ్యర్థులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. TSPSC నుంచి విడుదలయ్యే గ్రూప్-3, 4, డీఎస్సీ, గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ మొదలగు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పేద విద్యార్థులు ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళ్లడం కష్టంగా ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా పేద విద్యార్థులకు అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విధంగా తయారు చేయడానికి ఉచితంగా కోచింగ్ అందిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందుకోసం బీసీ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

* Group-3, 4. DSC, గురుకుల ఉపాధ్యాయ పోస్ట్‌లకు కోచింగ్ ఇవ్వనున్నారు.

అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలి. Group-3, 4 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు 10, Inter, Degree లో 60 శాతం మార్కులు. డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్ట్‌లకు అభ్యర్థులు బీఈడీలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ: 25, ఆగస్టు 2022.

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల తేదీ: 27, ఆగస్టు 2022.

కోచింగ్ ప్రారంభ తేదీ: 1, సెప్టెంబర్ 2022.

అభ్యర్థులు ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెం 040-27077929/040-24071178.


Next Story

Most Viewed