- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సన్ఫ్లేమ్ బ్రాండ్ను కొనుగోలు చేసిన వీ-గార్డ్!
ముంబై: ప్రముఖ వంటగది ఉత్పత్తుల తయారీ కంపెనీ సన్ఫ్లేమ్ను ఎలక్ట్రికల్స్, గృహోపకరణాల సంస్థ వీ-గార్డ్ కొనుగోలు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ రూ. 660 కోట్లని, పూర్తిగా నగదు రూపంలో ఇరు సంస్థల మధ్య ఒప్పందం పూర్తి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సన్ఫ్లేమ్ కొనుగోలు ద్వారా వీ-గార్డ్ సంస్థ వంటగది ఉత్పత్తుల విభాగంలో మరింత సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఈ భాగస్వామ్యం గృహోపకరణాల వ్యాపారంలో ప్రయోజనాలను అందిస్తుందని వీ-గార్డ్ తెలిపింది. సన్ఫ్లేమ్ ఎంటర్ప్రైజెస్కు చెందిన 100 శాతం వాటాను దక్కించుకునేందుకు అవసరమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వీ-గార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ మిథున్ చెప్పారు.
సన్ఫ్లేమ్ రుణ రహిత సంస్థ అని, దేశీయంగా కిచెన్ ఉపకరణాల మార్కెట్లో కీలకంగా ఉందని ఆయన తెలిపారు. కంపెనీ ముఖ్యంగా కుక్టాప్, చిమ్నీ, ప్రెజర్ కుక్కర్, మిక్సర్ గ్రైండర్, చిన్న వంటగది పరికారాలతో అతిపెద్ద బ్రాండ్ పోర్ట్ఫోలియోను కలిగి ఉందని వెల్లడించారు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం 2023, జనవరిలోపు పూర్తవుతుందని సన్ఫ్లేమ్ మేనేజింగ్ డైరెక్టర్ కె ఎల్ వర్మ పేర్కొన్నారు.