వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్!

by Disha Web Desk 17 |
వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పెంపు 3 శాతం వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుంది. వాహనాల తయారీలో కీలకమైన ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టాటా మోటార్స్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

దీంతో కంపెనీ ఈ ఏడాదిలో మూడోసారి పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదివరకు వాహనాల్లో కొత్త ఉద్గార నిబంధనలు పాటించేందుకు జనవరిలో 1.2 శాతం, మార్చిలో 5 శాతం మేర ధరలను పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా బీఎస్6 రెండో దశ ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇది వాహన తయారీదారుల ఉత్పత్తిలో ఖర్చుల పెరుగుదలకు దారితీసింది.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story