ఐఫోన్‌ల కోసం టాటా గ్రూప్ అతిపెద్ద తయారీ ప్లాంట్

by Harish |
ఐఫోన్‌ల కోసం టాటా గ్రూప్ అతిపెద్ద తయారీ ప్లాంట్
X

చెన్నై: ఐఫోన్‌ల తయారీ కోసం టాటా గ్రూప్ మరో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే విస్ట్రాన్‌కు చెందిన ప్లాంటును కొనుగోలు చేసిన సంస్థ త్వరలో దేశంలోనే అతిపెద్ద ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత మార్కెట్లో విస్తరణను వేగవంతం చేయాలని భావిస్తున్న యాపిల్ కంపెనీకి సహకారమందిస్తూ టాటా గ్రూప్ తమిళనాడులో కొత్త ప్లాంటును ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

12-18 నెలల్లోపు కొత్త ఫ్యాక్టరీలో కార్యకలాపాలను ప్రారంభించేలా, దాదాపు 20 అసెంబ్లీ లైన్లు, రెండేళ్లలోపు 50,000 మంది ఉద్యోగులను తీసుకునేలా టాటా గ్రూప్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. చైనాకు వెలుపల విడిభాగాల తయారీ, అసెంబ్లింగ్ కోసం భారత్ సహా మరో రెండు దేశాల్లో సరఫరాను పెంచాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే టాటా గ్రూప్ కొత్త ప్లాంటుపై దృష్టి సారించింది. ఈ వ్యవహారానికి సంబంధించి టాటా గ్రూప్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.



Next Story