సరికొత్త 'బర్గ్‌మ్యాన్ స్ట్రీట్' మ్యాక్సీ స్కూటర్‌ను విడుదల చేసిన సుజుకి!

by Disha Web Desk 13 |
సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మ్యాక్సీ స్కూటర్‌ను విడుదల చేసిన సుజుకి!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా బుధవారం తన సరికొత్త 'బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ ' స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీనికి ధరను రూ. 1,12,300(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ)గా నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సరికొత్త మ్యాక్సీ స్కూటర్ స్టాండర్డ్, రైడ్ కనెక్ట్ వంటి రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఇప్పటివరకు కంపెనీ నుంచి 125సీసీ విభాగంలో ఆదరణ కలిగిన బర్గ్‌మ్యాన్ స్ట్రీట్‌ను కొత్త ఫీచర్లతో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ పేరుతో తీసుకొచ్చింది.

ఈ స్కూటర్ ప్లాటినం సిల్వర్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మెటాలిక్ రాయల్ బ్రాంజ్ రంగుల్లో అందుబాటులో ఉంటుందని, మునుపటి బర్గ్‌మ్యాన్ కంటే ఈ కొత్త స్కూటర్ వేరియంట్‌లో 10 అంగుళాల స్థానంలో 12 అంగుళాల వెనుక టైర్ అమర్చినట్టు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా మునుపటి వేరియంట్ కంటే కొత్తది ఎక్కువ బరువుతో మెరుగైన పనితీరు ని కలిగి ఉంటుంది. అలాగే, ఇంజిన్ స్టార్ట్ లేదా స్టాప్ సిస్టమ్ ద్వారా స్కూటర్ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపడుతుందని కంపెనీ వివరించింది. భారత మార్కెట్లో మ్యాక్సీ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బర్గ్‌మ్యాన్ స్కూటర్‌కు మరిన్ని అప్‌డేట్లు జతచేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.


Next Story

Most Viewed