- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
9 వేలకు పైగా కార్ల రీకాల్ ప్రకటించిన మారుతీ సుజుకి!
న్యూఢిల్లీ: అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకి భారీ రీకాల్ను ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్లలో ముందు వరుసలోని సీట్ బెల్ట్ లోపం కారణంగా ఈ రీకాల్ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీకి చెందిన సియాజ్, బ్రెజా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటార్ మోడళ్లలో మొత్తం 9,125 యూనిట్లను రీకాల్ చేయనున్నట్టు, ఈ ఏడాది నవంబర్ 2-28 తేదీల మధ్య తయారైన వాటిని వెనక్కి పిలవనున్నట్టు మారుతీ సుజుకి తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది.
ఈ కార్లలోని ముందు వరుస సీట్ బెల్ట్లోని అడ్జస్టర్ అసెంబుల్ ఛైల్డ్ పార్ట్ ఒకదానిలో లోపం ఉందనే అనుమానం ఉందని, దీనివల్ల అరుదైన సందర్భాల్లో సీట్ బీల్ట్ విడిపోయే అవకాశం ఉన్నందున కార్లను రీకాల్ చేస్తున్నామని కంపెనీ వివరించింది. రీకాల్ చేయాల్సిన కార్లకు సంబంధించి వాటి యజమానులకు కంపెనీ నుంచి సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది. ఆయా కార్లను తనిఖీ చేసి లోపం ఉంటే ఉచితంగానే సీట్ బెల్ట్ భాగాన్ని మార్చి ఇవ్వనున్నట్టు మారుతీ సుజుకి పేర్కొంది.