- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హీరో బైక్ కొంటున్నారా! అయితే మీకు షాకింగ్ న్యూసే
by Disha Web Desk 17 |
X
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా మోటార్సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్షోరూమ్ ధరలను పెంచుతున్నట్టు దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ ధరల పెంపు రూ. 1,000 వరకు ఉంటుందని, మోడల్, ప్రాంతాన్ని బట్టి వ్యత్యాసం ఉండనున్నట్లు గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్లో కంపెనీ వెల్లడించింది.
పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని, దేశంలో అధిక ద్రవ్యోల్బణం వల్ల క్రమంగా విడి భాగాల ధరలు పెరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రూ. వెయ్యి వరకు పెంచక తప్పలేదని కంపెనీ వివరించింది. కాగా, హీరో మోటోకార్ప్ టూ-వీలర్ అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో 1.92 శాతం పెరిగాయి.
గతేడాది ఇదే నెలలో 4.53 లక్షల యూనిట్లను విక్రయించగా, ఈసారి 4.62 లక్షల యూనిట్లకు పెరిగాయి. దేశీయ అమ్మకాలు 4.55 శాతం పుంజుకున్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
Next Story