- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రారంభమైన డిజిటల్ రూపాయి!
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ రిటైల్ డిజిటల్ రూపాయి (ఈ-రూపీ)ని రిటైల్ విభాగంలో ప్రయోగాత్మకంగా గురువారం ప్రారంభించింది.మొదట నాలుగు నగరాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ-రూపీని ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్లలో అమల్లోకి తెచ్చారు. అనంతరం రెండో దశలో హైదరాబాద్, ఇండోర్, గుహవాటి, కొచ్చి, పాట్నా, లక్నో, సింలా, గాంగ్టక్, అహ్మదాబాద్లకు విస్తరించనున్నట్టు ఆర్బీఐ తెలిపింది.
ప్రస్తుతానికి ఎస్బీఐ, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లు ఈ-రూపీ లావాదేవీల్లో పాల్గొనగా, తర్వాతి దశలో మరో నాలుగు బ్యాంకులు కలవనున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొంతమంది వినియోగదారులను బ్యాంకులు ఎంపిక చేసి, వారి ఖాతా నుంచి నగదును సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ) వ్యాలెట్కు బదిలీ చేశాయి. ఈ సీబీడీసీ వ్యాలెట్లో ఉన్న సొమ్ము డిజిటల్ రూపీగా చలామణి అవనుంది.
ఈ-రూపీ లావాదేవీ నిర్వహించేందుకు బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. కాగా, నెలరోజుల క్రితం టోకు లావాదేవీల కోసం ప్రారంభించిన డిజిటల్ రూపాయి వల్ల పెద్ద ప్రయోజనాలేమీ కనిపించడంలేదని పలువురు బ్యాంకర్లు తెలిపారు. ఆర్బీఐ ఈ-రూపీ ఇంటర్నెట్ ఆధారిత బ్యాంకింగ్తో సమానంగా ఉందని ఏడుగురు బ్యాంకర్లు పేర్కొన్నారు. అయితే, ఇది ప్రారంభం మాత్రమే. భారత్లోని సీబీడీసీ పూర్తిగా పేపర్ కరెన్సీని భర్తీ చేయకపోవచ్చు. కానీ ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశాలున్నాయని సీనియర్ బ్యాంకర్ ఒకరు తెలిపారు.