ఈ నెలలో మరోసారి పెరగనున్న సిమెంట్ ధరలు!

by Disha Web Desk 17 |
ఈ నెలలో మరోసారి పెరగనున్న సిమెంట్ ధరలు!
X

చెన్నై: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సిమెంట్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఆగష్టు నెల నుంచి ఇప్పటివరకు బస్తాకు రూ. 16 చొప్పున పెరిగిన ధరలు, ప్రస్తుత నెలలో మరోసారి పెరగనున్నాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అభిప్రాయపడింది. గతనెలలోనే సిమెంట్ ధర బ్యాగ్‌కు రూ. 6-7 వరకు పెరిగాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో లాభదాయకతను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఈ నెలలో దేశవ్యాప్తంగా బ్యాగుకు రూ. 10-15 వరకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎమ్కే గ్లోబల్ తెలిపింది. దేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో ధరలు ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, ఉత్తర, తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో ధరలు పెరగవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి ఈ అంశం చర్చల దశలోనే ఉందని, కొద్దిరోజుల్లో దీనిపై కంపెనీలు ప్రకటిస్తాయని ఎమ్కే గ్లోబల్ వెల్లడించింది.



Next Story