- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈ నెలలో మరోసారి పెరగనున్న సిమెంట్ ధరలు!
by Disha Web Desk 17 |
X
చెన్నై: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సిమెంట్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఆగష్టు నెల నుంచి ఇప్పటివరకు బస్తాకు రూ. 16 చొప్పున పెరిగిన ధరలు, ప్రస్తుత నెలలో మరోసారి పెరగనున్నాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అభిప్రాయపడింది. గతనెలలోనే సిమెంట్ ధర బ్యాగ్కు రూ. 6-7 వరకు పెరిగాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో లాభదాయకతను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఈ నెలలో దేశవ్యాప్తంగా బ్యాగుకు రూ. 10-15 వరకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎమ్కే గ్లోబల్ తెలిపింది. దేశంలోని పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో ధరలు ఫ్లాట్గా ఉన్నప్పటికీ, ఉత్తర, తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో ధరలు పెరగవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి ఈ అంశం చర్చల దశలోనే ఉందని, కొద్దిరోజుల్లో దీనిపై కంపెనీలు ప్రకటిస్తాయని ఎమ్కే గ్లోబల్ వెల్లడించింది.
Next Story