ఎంసీఎల్ఆర్ రేటును పెంచిన మూడు బ్యాంకులు!

by Disha Web Desk 17 |
ఎంసీఎల్ఆర్ రేటును పెంచిన మూడు బ్యాంకులు!
X

ముంబై: దేశీయంగా అతిపెద్ద బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను పెంచుతున్నట్టు ప్రకటించాయి. సవరించిన రేట్లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. ఎంసీఎల్ఆర్ రేటు పెంపు కారణంగా వినియోగదారులు తీసుకునే గృహ, వ్యక్తిగత, వాహన రుణాలపై వడ్డీ రేట్ల ప్రభావితం ఉంటుంది.

బ్యాంకుల వివరాల ప్రకారం, ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రధానంగా ఖాతాదారులు తీసుకునే అన్ని రకాల రుణాలపై ప్రభావితం చేసే ఏడాది కాలవ్యవధిపై ఎంసీఎల్ఆర్ రేటు 8.30 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. అలాగే, నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను వరుసగా 8.15 శాతానికి, 8.20 శాతానికి, 8.35 శాతానికి పెంచారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎంసీఎల్ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటును 8.05 శాతం నుంచి 8.10 శాతానికి పెంచింది. ఒక నెల, మూడు, ఆరు నెలలు ఎంసీఎల్ఆర్ వరుసగా 7.50 శాతానికి, 7.60 శాతానికి, 7.80 శాతానికి పెంచింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఎంసీఎల్ఆర్‌ను అధికంగా 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్‌ను 7.95 శాతం నుంచి 8.15 శాతానికి పెంచింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్‌ను 7.65 శాతం నుంచి 7.90 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.



Next Story

Most Viewed