ఏప్రిల్-20: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

by Disha Web Desk 6 |
ఏప్రిల్-20: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
X

దిశ, ఫీచర్స్: బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ కొనుగోలు దారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏప్రిల్ నెలలో అమాంతం పెరుగుతుండటంతో చాలామంది బంగారం పేరు వింటేనే భయపడిపోతున్నారు. మార్చి వరకు రూ. 60 వేల వరకు ఉన్న రేట్లు.. ఏప్రిల్‌లో మాత్రం రూ. 80 వేలకు చేరువలో ఉన్నాయి.

నిన్నటి ధరలతో పోలిస్తే బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. రూ. 68,050గా ఉంది. అలాగే రూ. 24 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగడంతో రూ. 74, 240గా ఉంది. ఇక కిలో వెండి రూ. 90,000 స్థిరంగా కొనసాగుతుంది. అయితే హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ.68,050

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 74,240

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ.68,050

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 74,240

Next Story

Most Viewed