- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డెలివరీల కోసం భారత్లో తొలి ఎయిర్ సేవలు ప్రారంభించిన అమెజాన్!
హైదరాబాద్: రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ, వేగవంతమైన డెలివరీ సేవలందించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో 'అమెజాన్ ఎయిర్' సేవలను ప్రారంభించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా వస్తువులను తొందరగా డెలివరీ అందించేందుకు వీలవుతుందని కంపెనీ సోమవారం ప్రకటనలో తెలిపింది.
అమెజాన్ ఎయిర్ సేవల ద్వారా ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాలకు వస్తువులను త్వరగా డెలివరీ చేసేందుకు అమెజాన్ ఇండియా బోయింగ్ 737, బోయింగ్ 800 కార్గో విమానాలను ఉపయోగించనుంది. దీనికోసం బెంగళూరుకు చెందిన క్విక్జెట్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్లో ఈ-కామర్స్ సేవల కోసం ఓ కంపెనీ విమానసేవలను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
అమెజాన్ సంస్థ ఇదివరకు 2016లో అమెరికాలో తన ఎయిర్ సేవలను ప్రారంభించింది. అనంతరం యూకేలో సేవలను విస్తరించిన తర్వాత, మూడో దేశంగా భారత్లో దీన్ని మొదలుపెట్టింది. అమెజాన్ ఎయిర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డెలివరీ సేవలను సమర్థవంతంగా అందించగలమని, డెలివరీ నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని అమెజాన్కు చెందిన అఖిల్ చెప్పారు.