- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, భద్రాచలం టౌన్ : సమాజసేవా తత్పరుడు, గ్రీన్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు గోళ్ళ భూపతిరావుకు రాష్ట్ర స్థాయి ప్రతిభా రత్న అవార్డు దక్కింది. వైజాగ్కు చెందిన అఖిల భారత సాంస్కృతిక సమాఖ్య వారు ఈ అవార్డును ప్రదానం చేశారు. వైజాగ్లోని మద్దెలపాలంలో గల కళాభారతి ఆడిటోరియంలో సంస్థ కన్వీనర్ డాక్టర్ గనగళ్ళ విజయకుమార్, వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.
స్వతహాగ మొక్కల ప్రేమికుడైన భూపతిరావు.. ఉద్యానవన శాఖ అధికారిగా పనిచేసిన కాలంలో ఐటీడీఏలో లక్షల మొక్కలు గిరిజనులతో నాటించి వాటి పోషణ బాధ్యత, సక్రమ నిర్వహణ చేయించిన ఘనత ఆయనకు ఉంది. 25 ఏండ్ల తన ఐటీడీఏ సర్వీసులో 8 అవార్డులను పొందారు. పదవీ విరమణ తర్వాత గ్రీన్ భద్రాద్రి సంస్థలో చురుకైన పాత్ర పోషిస్తూ, కొన్నివేల మొక్కలను భద్రాచలంలో నాటించి వాటిని సంరక్షిస్తూ పట్టణ ప్రజల ప్రశంసలను అందుకొంటున్నారు.