బందీ అయిన తెలంగాణ విముక్తే నా లక్ష్యం : RSP

by  |
BSP leader RS ​​Praveen Kumar
X

దిశ, కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిందని, విముక్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో బీఎస్పీ పోరాడుతోందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో బీఎస్పీ పార్టీ కార్యాలయాన్ని ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా పార్టీని బలమైన శక్తిగా ఏర్పాటు చేసి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జనాభాలో సింహ భాగం ఉన్న బహుజనులకు రాజకీయ అధికారం ద్వారానే అభివృద్ధి లభిస్తోందని తెలిపారు. తాను గురుకుల కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా సంక్షేమ సైనిక పాఠశాలలతో పాటు మహిళలకు సైనిక గురుకుల డిగ్రీ కళాశాల మంజూరు చేసినట్లు గుర్తుచేశారు.


Next Story

Most Viewed