మరదలితో ప్రేమాయణం.. నడిరోడ్డుపై గొంతుకోసి..!

by  |
మరదలితో ప్రేమాయణం.. నడిరోడ్డుపై గొంతుకోసి..!
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇది వరకే ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను భార్య సోదరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో అత్తింటి వారు మాట్లాడుకుందామని ఇంటికి పిలిచి అతని కాళ్లు చేతులు కట్టేసి.. నడిరోడ్డుపై గొంతు కోసి దారుణంగా హతమార్చారు. కంచన్ బాగ్ పోలీసుల కథనం ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన మునవర్ ఖాద్రి (27) వృత్తి రీత్యా కారు డ్రైవర్. చాంద్రాయణ గుట్ట డివిజన్ హాఫిజ్ బాబా నగర్ ప్రాంతానికి చెందిన యువతిని 5ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప, 24 రోజుల బాబు ఉన్నాడు.

అయితే, ఖాద్రి భార్య సోదరితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల వీరిద్దరూ పారిపోయి కొద్దిరోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అత్తింటివారు పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించారు. అయినా, అతనిలో ఏలాంటి మార్పులేదు. ఈ క్రమంలోనే మాట్లాడుకుందామని ఆదివారం ఖాద్రిని హఫీజ్ బాబా నగర్‌కు పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య వివాదం నెలకొంది. కోపోద్రిక్తులైన అమ్మాయి కుటుంబ సభ్యులు అల్లుడి కాళ్లు చేతులు కట్టేసి నడిరోడ్డుపై గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. సమాచారం అందుకున్న సంతోష్ నగర్ ఏసీపీ శివరామకృష్ణశర్మ, కంచన్ బాగ్ సీఐ జె. వెంకట్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed