- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
యువతులతో అధికార పార్టీ నేతల న్యూడ్ కాల్స్.. కేసులో ఊహించని ట్విస్ట్?

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమ పేరుతో యువతులతో న్యూడ్ కాల్స్ మాట్లాడి ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యవహారం జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు యువ నాయకుల హనీ ట్రాప్ వ్యవహారంలో ఇప్పుడు తీగ లాగితే డొంక కదులుతున్నట్టు తెలుస్తోంది. తమ పలుకుబడి, పరపతిని ఉపోయోగించుకుని మహిళలు, యువతులను వలలో వేసుకున్న వైనం అంతా బట్టబయలు కావడం సంచలనం రేపుతున్నది. తమలో తమకు వచ్చిన విభేదాల కారణంగా ఈ బాగోతం బయటకు రాగా ఈ రాసలీలల వ్యవహారంలో ఏకంగా ఓ పోలీస్ అధికారి, మరో అధికారి పాత్ర ఉన్నట్టు ప్రచారం గుప్పుమంటోంది. ప్రధాన సూత్రధారుల్లో ఓ యువ నేతతో గతంలో జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో పని చేసిన ఓ పోలీస్ అధికారి, అదే విధంగా పశుసంవర్ధక శాఖలో పని చేసిన ఓ జిల్లా స్థాయి అధికారి నెరిపిన రాసలీలల వ్యవహారం కూడా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో బాధితులు ఎవరూ కూడా కేసులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. కేసులు పెడితే తమ పరువు బజారున పడటం ఖాయం అనే కారణంతోనే నాయకుల నుంచి ఒత్తిళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తీగ లాగితే డొంక కలిదిలిన చందంగా ఈ వ్యవహారం తమ కొంపనే ముంచుతుందనే అభిప్రాయంతో పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూడ్ కాల్స్ బాగోతం వెలుగు చూడటంతో అధికార పార్టీపై ప్రత్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా తన శాఖకు చెందిన అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ స్పందించారు. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర ఉందనడం అవాస్తవమని అన్నారు. మహిళల పట్ల ఇలాంటి ఘటనలో సహించేది లేదని ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెప్పారు. సున్నితమైన ఇలాంటి విషయాల్లో అందరూ సంయమనం పాటించాలని కోరారు. ఏదైనా నిర్ధిష్టమైన ఆధారాలుంటే పోలీసులపై కూడా చర్యలు తప్పని స్పష్టం చేశారు.