- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట అమరావతి రైతులు చేపడుతున్న మహాపాదయాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ఈ రోజు పాదయాత్ర చేపట్టడం లేదు. శుక్రవారం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర కొనసాగింది. శనివారం యరజర్ల గ్రామం నుంచి పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే నిడమాలూరు పంచాయితీలోని ఒక వార్డుకు ఆదివారం ఎన్నిక జరగనుంది.
వార్డు ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో బయటికి వ్యక్తులు ఎవరూ గ్రామంలో ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి. అందువల్ల పాదయాత్రకు ఇవాళ విరామం ప్రకటించామని, ఆదివారం నుంచి యథావిధిగా యాత్ర జరుగుతుందని రైతులు తెలిపారు.
Next Story