అమరావతి రైతుల మహాపాదయాత్రకు బ్రేక్

by  |
అమరావతి రైతుల మహాపాదయాత్రకు బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట అమరావతి రైతులు చేపడుతున్న మహాపాదయాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ఈ రోజు పాదయాత్ర చేపట్టడం లేదు. శుక్రవారం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర కొనసాగింది. శనివారం యరజర్ల గ్రామం నుంచి పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే నిడమాలూరు పంచాయితీలోని ఒక వార్డుకు ఆదివారం ఎన్నిక జరగనుంది.

వార్డు ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో బయటికి వ్యక్తులు ఎవరూ గ్రామంలో ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి. అందువల్ల పాదయాత్రకు ఇవాళ విరామం ప్రకటించామని, ఆదివారం నుంచి యథావిధిగా యాత్ర జరుగుతుందని రైతులు తెలిపారు.


Next Story

Most Viewed