- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ,సిద్దిపేట: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తీసిన గుంతలో పడి పదకొండు ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. పట్టణ పరిధిలోని తొమ్మిదో వార్డు కేసీఆర్ నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తీసిన గుంతలో కార్తీక్ అనే పదకొండు ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. తన ఇద్దరు మిత్రులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే వారు వెళ్లి బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
కుటుంబ సభ్యులు వచ్చి బాలుడిని బయటకు తీసే సరికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శవ పంచనామా కోసం కార్తీక్ మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. తన కుమారుడు చనిపోవడానికి కారణం డ్రైనేజీ కోసం తీసిన గుంత వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడమే అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిని ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.