- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, విశాఖపట్నం : బురేవీ తుఫార్ తీవ్రత నేపథ్యంలో దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ తీరాలకు అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర శ్రీలంకపై గత ఆరు గంటలలో 11 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి లాట్ సమీపంలోని మన్నార్ గల్ఫ్ వద్ద బురేవీ తుపాను కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మన్నార్కు పశ్చిమ-వాయువ్య దిశలో 30 కి.మీ, పంబస్కు తూర్పు-ఆగ్నేయంలో 40 కి.మీ, కన్యాకుమారికి తూర్పు-ఈశాన్యంగా 260 కి.మీ. దూరంలో ఉందని తెలిపింది.
దక్షిణ తమిళనాడు తీరం పంబన్, కన్యాకుమారి మధ్య నేడు రాత్రి, రేపు తెల్లవారు జామున సైక్లోనిక్ తుపానుగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ సమయంలో 70-80 కి.మీ వేగంతో బలంగా గాలులు వీచే అవకాశం ఉందని, దక్షిణ తమిళనాడు తీరప్రాంత జిల్లాలతో పాటు రామనాథపురం, కన్యాకుమారి జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.