వారి బాటలో నడిస్తే నట్టేట మునిగి నట్టే: మురళీధర్ రావు

by  |
వారి బాటలో నడిస్తే నట్టేట మునిగి నట్టే: మురళీధర్ రావు
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: రజాకార్ల బాటలో నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక నట్టేట మునిగి నట్టేనని బీజేపీ జాతీయ కార్యదర్శి పి. మురళీధర్ రావు అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆరేండ్ల కిందట ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్‌ను ప్రజలు ఆదరిస్తే కుటుంబ పార్టీగా మారి అప్రజాస్వామిక పాలన చేస్తోందని ధ్వజ మెత్తారు. రజాకార్ల బాటలో నడిచిన కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే టీఆర్ఎస్ పార్టీకి పడుతుందని జోస్యం చెప్పారు. ఎన్నో ఉద్యమాలు, ప్రాణ త్యాగాలతో తెలంగాణను సాధించుకుంటే హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజ మెత్తారు.


Next Story

Most Viewed