ఎమ్మెల్యే కందాలను అడ్డుకున్న బీజేపీ నేతలు

by Sridhar Babu |
ఎమ్మెల్యే కందాలను అడ్డుకున్న బీజేపీ నేతలు
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని ఖమ్మం నగర బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ డంపింగ్ యార్డు తరలించాలని జీవో జారీ చేసినప్పటికీ.. కావాలనే దానవాయిగూడెంలో నగర చెత్తను డంపింగ్ చేస్తున్నారని, ఇక్కడి నుంచి తరలించి ఈ ప్రాంత ప్రజలను పొగ, కాలుష్యం నుంచి కాపాడాలని ఎమ్మెల్యేను బీజేపీ నాయకులు కందుల కృష్ణ, ఎపురి నాగేశ్వరరావు , రమేష్ యాదవ్ చౌదరి అడ్డుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే కందాల.. వెంటనే నగర కమిషనర్ తో ఫోన్‌లో మాట్లాడారు. డంపింగ్ యార్డును సాధ్యమైనంత త్వరగా తరలించాలని సూచించారు.



Next Story

Most Viewed