ప్రజా సంగ్రామ పాదయాత్ర లో బండి సంజయ్

by  |
ప్రజా సంగ్రామ పాదయాత్ర లో బండి సంజయ్
X

దిశ, హుస్నాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ పాదయాత్ర సిద్దిపేట జిల్లాలో కొనసాగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లితో పాటు కోహెడ మండలం వింజపల్లి, రామచంద్రాపూర్ గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. రామచంద్రపురం గ్రామంలో సబ్ స్టేషన్ సమీపంలో సంజయ్ రాత్రి బస చేసి బుధవారం పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు.

బసకు సంబంధించిన ఏర్పాట్లు బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నాగిరెడ్డి విజయపాల్ రెడ్డి తో పాటు నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షుడు బీజేపీ శ్రేణులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.



Next Story

Most Viewed