- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ సర్కార్ కట్టే పన్నుల కంటే రాష్ట్రానికి కేంద్రం తక్కువగా నిధులు ఇస్తోందని.. ఎక్కువగా ఇస్తోందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న కేటీఆర్ సవాల్ను బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. గురువారం కామారెడ్డి జిల్లా బంజారాతండాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్ తన సవాల్కు కట్టుబడి ఉంటే.. మోడీ అపాయింట్మెంట్ తీసుకుంటానని.. లెక్కలు తేలుస్తా అన్నారు.
గత ఏడేళ్లలో పన్నుల వాటా, ప్రయోజిత పథకాలు, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే, ఫ్రీ వ్యాక్సిన్ పేరిట ఇప్పటి వరకు రూ.2 లక్షల 52 వేల కోట్లు తెలంగాణకు చెల్లించిందన్నారు. ఇవి కేవలం ఐదాంశాల్లో మాత్రమేనని, దేశ రక్షణ, విమానయాన, శాటిలైట్ నిర్వహణ, జాతీయ విపత్తు వంటి అంశాల్లో కేంద్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సవాల్ విసిరిన మంత్రికి ఏ మాత్రం సిగ్గున్నా రాజీనామా చేసి తీరాలని ప్రతి సవాల్ విసిరారు బండి సంజయ్. తెలంగాణకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారని.. పార్లమెంట్లో ఇవే ప్రశ్నలడిగితే చట్టసభల సాక్షిగా టీఆర్ఎస్ నేతల బండారం బయటపడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.