వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బలరాం జాదవ్

by  |
వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బలరాం జాదవ్
X

దిశ, నేరడిగొండ: నేరడిగొండ మండలం బుద్ధికొండ గ్రామంలో దాసరి ఓంకార్(24) అనే యువకుడు మరణించాడు. ఈ వార్త తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాల్లోకి వెళ్తే దాసరి రమేశ్ పెద్ద కుమారుడు ఓంకార్ మరణ వార్తను వారి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పొతున్నారు. వారి బాధ వర్ణనాతీతం, వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. కొడుకును పోగొట్టుకొని దుఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి బాధను తగ్గించే ప్రయత్నం చేశారు. బలరాంతో పాటు మాజీ సర్పంచ్ అన్నేల నారాయణ, ఉపసర్పంచ్ జగదీష్, లస్మన్న, Dr సుమన్, రాజన్న, లక్ష్మణ్, మైసన్న, గట్టు నారాయణ, జాదవ్ భీమ్ రావ్, అడె చంపత్, సబ్లే సంతోష్, రాజశేఖర్ శ్రీధర్, తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed