- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఉత్తరాంధ్ర: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకులు చేసిన దాడిని మాజీమంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఖండించారు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం అప్పుల పాలయిందని, ప్రజా వ్యతిరేకతను, విమర్శలను తట్టుకోలేకే ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి తమ పార్టీ నాయకులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా డీజీపీ వైఫల్యమని, పోలీసులు దగ్గరుండి దాడులు చేయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయలేని డీజీపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విజయసాయిరెడ్డి, కె.కె.రెడ్డి ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తే వారు విశాఖపట్నంలో తిరగగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తమ నాయకులు ఎన్టీఆర్ , చంద్రబాబు ఇటువంటి సంస్కృతి నేర్పలేదని అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఏపీ పోలీసులకు చేతగాక విశాఖ మన్యంలోకి తెలంగాణ పోలీసులు వచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు చింతపల్లి అడవుల్లో కాల్పులు జరిపితే, ఏపీ పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.