మైనార్టీ గురుకులాల స్థలాల ఆక్రమణలను నివారించండి : యాకూబ్ పాషా

by Sridhar Babu |   ( Updated:2021-08-06 21:33:50.0  )
మైనార్టీ గురుకులాల స్థలాల ఆక్రమణలను నివారించండి : యాకూబ్ పాషా
X

దిశ, కొత్తగూడెం: జిల్లాలో మైనార్టీ గురుకులాల నిర్మాణానికై ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో జరుగుతున్న ఆక్రమణలను నివారించాలని మైనార్టీ జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో అధికారులను కోరారు. 2016 లో జిల్లాలో మైనార్టీ గురుకుల పాఠశాలల నిర్మాణానికై కొత్తగూడెం లోని రామవరం.. ఇల్లందు పట్టణంలో అశ్వారావుపేట మండలం ముదిగొండ గ్రామంలో, బూర్గంపహడ్ మండలం కృష్ణ సాగర్ లందు స్థలాలను కేటాయించటం జరిగిందని గుర్తు చేశారు. అందులో భాగంగా కొత్తగూడెం రామవరంలోని సర్వే నెంబరు 20/1 నందు 7 ఎకరాల స్థలాన్ని కేటాయించగా అట్టి స్థలంలో కొంతమంది కబ్జా చేసి, ఇండ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేశారని తెలిపారు.

అదేవిధంగా ఇల్లందులో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. మైనార్టీ గురుకులాల సంస్థ నిర్లక్ష్యం కారణంగా విలువైన స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని తెలిపారు. కావున రామవరంలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలకు కేటాయించిన స్థలంలోని ఆక్రమణదారులపై తగు చర్యలు తీసుకొని ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలాలన్నింటిని సర్వే చేయించి తగు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్, మైనార్టీ గురుకులాల సంస్థ కార్యదర్శి, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, డీఆర్వో, కొత్తగూడెం తహసీల్దారు లకు ఫిర్యాదు చేసినట్లు ఎండీ యాకూబ్ పాషా విలేకరులకు తెలిపారు.



Next Story

Most Viewed