దొంగలు హల్ చల్.. 6 దేవాలయాల్లో చోరీకి యత్నం

by  |
దొంగలు హల్ చల్.. 6 దేవాలయాల్లో చోరీకి యత్నం
X

దిశ, కాజీపేట: గుళ్ళను టార్గెట్ చేస్తూ ఆరు దేవాలయాల్లో చోరీకి యత్నించిన సంఘటన ఖాజీపేట మండలంలోని కడిపికొండ, మడికొండ గ్రామాలలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కడిపికొండ గ్రామ శివారులోని చంద్రమౌళీశ్వర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఆంజనేయ స్వామి దేవాలయంలోని హుండీలను పగలగొట్టి అందులోనే నగదుకు చోరికి యత్నించారు. హుండీలో ఏమీ లేకపోవడంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పగలగొట్టిన తాళాలను దొంగలు వెంట తీసుకెళ్లారు.

అలాగే మడికొండ గ్రామ శివారులోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలోని హుండీని పగలగొట్టారు. హుండీలో ఏం లేకపోవడంతో వెనుదిరిగారు. సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు జరుపుతున్నారు. ఖాజీపేట మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.


Next Story