ధాన్యం కొనుగోళ్లకు ముమ్మర ఏర్పాట్లు

by  |
ధాన్యం కొనుగోళ్లకు ముమ్మర ఏర్పాట్లు
X

దిశ, మెదక్: ధాన్యం కొనుగోళ్ల కోసం చేపట్టే చర్యలపైన శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ముఖ్యంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించేందుకు కావలసిన ఏర్పాట్లను చేయాలని ఆయన సూచించారు.

Tags: collector, review, arrangements, grain purchases, siddipet



Next Story

Most Viewed