శాసనసభ 2రోజులు.. శాసనమండలి 3 రోజులు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా శాసనమండలి బీఏసీ సమావేశం నిర్వహించారు. పలు బిల్లులు ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు మూడ్రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సభలో ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నారో సమాచారం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. ఒకవేళ సీఆర్డీయే రద్దు బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటే, అది సరైన నిర్ణయం కాదని టీడీపీ సభ్యులు స్పష్టం చేశారు. అటు, ఏపీ అసెంబ్లీని రెండ్రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.</p>

శాసనసభ 2రోజులు.. శాసనమండలి 3 రోజులు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా శాసనమండలి బీఏసీ సమావేశం నిర్వహించారు. పలు బిల్లులు ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు మూడ్రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు.

సభలో ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నారో సమాచారం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. ఒకవేళ సీఆర్డీయే రద్దు బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటే, అది సరైన నిర్ణయం కాదని టీడీపీ సభ్యులు స్పష్టం చేశారు. అటు, ఏపీ అసెంబ్లీని రెండ్రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Next Story