- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పేదలందరికీ ఇండ్లు పథకంపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీలో 28.30 లక్షల ఇండ్ల నిర్మాణం కోసం గృహ నిర్మాణ శాఖకు అనుమతులు జారీ చేసింది. మొదటి దశలో 15.10 లక్షల ఇండ్లు, రెండో విడతలో 13.20 లక్షల ఇండ్ల నిర్మాణం చేయనున్నారు.
దీని కోసం రూ.24,776 కోట్లను ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు జారీ చేసింది. ఇండ్ల పట్టాలతో పాటు సొంతభూమి కలిగిన వారికీ ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ, లబ్ది దారులకు ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వనున్నారు. ప్రతీ ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా ఇవ్వనున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇండ్ల నిర్మాణ సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్ల నిర్మాణం కోసం రూ.920 కోట్లు కేటాయించింది.
Next Story