ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం ఖరారు

by  |
ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం ఖరారు
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి ముహూర్తం ఖరారు అయింది. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్నిడిసెంబర్‌ 25న చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కోర్టు స్టేలు ఉన్న చోట మినహా, మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ డి–ఫామ్‌ పట్టా ఇచ్చి, ఇంటి స్థలం కేటాయించాలని స్పష్టం చేశారు. తొలి దశలో దాదాపు 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30,68,281 మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాల కోసం గుర్తించింది.


Next Story

Most Viewed