- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, కరీంనగర్: వారిద్దరు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులే.. ఒకరు నామినేటెడ్ పోస్టులో బాధ్యతలు నిర్వర్తిస్తుంటే.. మరొకరు ఎంపీపీగా కొనసాగతున్నారు. ఒకే పార్టీలో ఉన్న ఆ నాయకులిద్దరి మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే… ? పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిషత్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్కల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ కారణంగా వచ్చిన ఈ గొడవలో సత్యనారాయణ గౌడ్ కళ్లు నెత్తికెక్కాయా, గజ్జె కట్టుకుని వస్తావా అంటూ ఎంపీపీ దేవక్కపై సీరియస్ అయ్యారు. మండల సభలో చోటు చేసుకున్న ఈ ఘటనను చూసి విస్తూపోవడం అధికారుల వంతయింది.
కన్నీరు పెట్టిన ఎంపీపీ
రామగిరి ఎంపీపీ దేవక్క కన్నీరు మున్నీరుగా విలపించారు. మహిళా ఎంపీపీని అని కూడా చూడకుండా ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు ఎదురు కావద్దని కన్నీటి పర్యంతం అయ్యారు.
- Tags
- Latest News