- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సమ్మర్లో నీటి ఎద్దడి కట్టడికి ముందస్తు ప్రణాళిక..!

దిశ ప్రతినిధి, కడప: ప్రస్తుత వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లా గ్రామీణ నీటి సరఫరా అధికారులు దృష్టి పెట్టారు. ఇందుకోసం సమ్మర్ యాక్షన్ ప్లాన్ను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఈ ఏడాది జిల్లాలో ఆశించిన మేరకు వర్షాలు కురవలేదు. దీంతో రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయే అవకాశాలు ఉంటాయి. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి ఎద్దడి ఎదురు కాకుండా తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.
*10.10 కోట్లతో ప్రణాళిక
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రాబోయే నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు తాగునీటి సరఫరా అందించేందుకు వీలుగా రూ.1010.82 లక్షలతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రభుత్వానికి పంపారు. ఈ నివేదిక మేరకు ప్రభుత్వం నీటి ఎద్దడి నివారణకు అవసరమైన నిధులు మంజూరు చేస్తూ ఉంటుంది. ప్రధానంగా నీటి ఎద్దడి గ్రామాల్లో ట్రాన్స్ పోర్టేషన్, హైరింగ్, డీపెనింగ్, ఫ్లస్సింగ్, పైప్ లైన్ మరమ్మత్తుల కోసం ఈ నిధులు ఖర్చు చేస్తారు. రూరల్ వాటర్ అండ్ సప్లై శానిటేషన్ శాఖ హ్యాండ్ పంప్స్, ప్రొటెక్ట్ సప్లై(పి.డబ్ల్యు.ఎస్), కాంప్రెహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లై(సి బి డబ్ల్యు.ఎస్) స్కీమ్స్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు.
జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోని 35 మండలాల్లోని 321 గ్రామాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రాబోయే నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు తాగునీటి సరఫరా అందించేందుకు అవసరమైన నిధులతో ఈ ప్రణాళిక రూపొందించారు. ప్రతి మనిషికి రోజుకు 55 లీటర్ల నీటిని అందిస్తారు. తాగునీటి ఎద్దడి వున్న 321 హ్యాబిటేషన్ గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి సరఫరా చేసేందుకు 15,83,358 ట్రిప్పులు నీటిని సరఫరా చేసేందుకు రూ.815.54 లక్షలు ఖర్చు చేయనున్నారు.
*యాప్ ద్వారా ఫిర్యాదులు..
తాగునీటి సరఫరా, సమస్యలను పరిష్కరించేందుకు ఆర్.డబ్ల్యు.ఎస్ యాప్ ను ఏర్పాటు చేశారు. ఈ యాప్ ద్వారా తాగునీటి సమస్య, బోర్లు, మోటార్లు, పైప్ లైన్ మరమ్మత్తులకు సంబంధించి ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చు. అలాగే కాల్ సెంటర్ నెంబర్ 9100122375 కు సంప్రదించవచ్చు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాటి పరిష్కారానికి కృషి చేస్తారు.
*మూగ జీవాలకు నీటి సరఫరా
మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు, చాపాడు, దువ్వూరు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం మండలాల్లోని 21 హ్యాబిటేషన్ గ్రామాల్లో మూగజీవాలకు 726 ట్రిప్పుల నీటి సరఫరాకు రూ.3.96 లక్షలు ఖర్చు చేయనున్నారు.
*ఎద్దడి నివారణకు చర్యలు:
ఆర్.డబ్ల్యు.ఎస్ అండ్ శానిటేషన్ సూపరింటెండెంట్ ఏడుకొండలు మాట్లాడుతూ ఈ వేసవిలో గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రజలకు తాగునీటి సమస్య వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెలితే పరిష్కరిస్తామన్నారు.