- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
24 సీట్లకు ఏ ప్యాకేజీ ఆపింది?.. మంత్రి రోజా హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: పవన్ కళ్యాణ్ మనల్ని ఎవడ్రా ఆపేది అన్నాడని, ఇప్పుడు 24 సీట్లకు ఏ ప్యాకేజీ ఆపిందని వైసీపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓ ప్రముఖ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అన్నందుకు తెగ గింజుకున్నాడని, మనల్ని ఎవడ్రా ఆపేది అని డైలాగులు కొట్టాడని, ఇప్పుడు 24 సీట్లకు చంద్రబాబు ఆపాడా?, ప్యాకేజీ ఆపిందా? పవన్ కళ్యాణ్ చెప్పాలని ప్రశ్నించారు.
175 స్థానాల్లో ముష్టి 24 సీట్లకు ఓకే చెప్పి వచ్చాడంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి లేదని అన్నారు. ఆయన సోదరుడు చిరంజీవి ఉమ్మడి ఏపీలో 294 సీట్లలో పోటీ చేశారని, ఆ మధ్యలో 9 తీసేసి 24 సీట్లకు పవన్ ఓకే చెప్పాడని ఎద్దేవా చేశారు. పవన్ నిర్ణయంతో ఆయన మెగా అభిమానులకు, ఆ సామాజిక వర్గం వారికి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదని, కావాలంటే వైసీపీలోకి వచ్చి తల పెట్టుకోవాలని బహిరంగంగా ఆహ్వానించారు. జనసేనలో ఉంటే ఎప్పుడు ఎవరి జెండా మోయాలో అర్ధం కాదని, వైసీపీకి వస్తే ఒక్కటే జెండా, ఒక్కటే ఎజెండా ఉంటుందని రోజా వ్యాఖ్యానించారు.
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ తిరిగావ్..24 సీట్లకు నిన్ను ఎవరు ఆపారు @PawanKalyan?@ncbn ఆపాడా..? ప్యాకేజీ ఆపిందా..? ఏమి ఆపిందో ప్రజలకు చెప్పు.
— YSR Congress Party (@YSRCParty) March 2, 2024
175 సీట్లలో ముష్టి 24 సీట్లలో @JanaSenaParty పోటీ చేయడం సిగ్గుచేటు.
-మంత్రి ఆర్కే రోజా#TDPJSPCollapse#MosagaduBabu#PoliticalBrokerPK… pic.twitter.com/YFigJJebXo