Alluri district: 120 ఎకరాల భూమిని ఆక్రమించుకుంటున్నారని..!

by Disha Web Desk 16 |
Alluri district: 120 ఎకరాల భూమిని ఆక్రమించుకుంటున్నారని..!
X

దిశ, డైనమిక్ బ్యూరో : అల్లూరి జిల్లా అనంతగిరి మండలం బూరేగ చిన్నకోనేలలో మెడకు ఉరితాడుతో గిరిజనుల వినూత్న నిరసనకు దిగారు. గ్రామాల్లోని 120 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రెవెన్యూ అధికారులు మార్పు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూములను విడిచిపెట్టాలని రెవెన్యూ అధికారులు తమకు నోటీసులు పంపారని ఆరోపించారు. తాము సాగు చేసుకుంటూ, ఉంటున్న భూమిని ఎలా పట్టా భూములుగా మారుస్తారని ప్రశ్నించారు. తక్షణమే తమ భూములను తమకు విడిచిపెట్టాలని, అధికారులు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed