- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
కువైట్ ప్రమాద బాధితులకు పరిహారం అందజేత
by srinivas |
X
దిశ, నిడదవోలు: కువైట్ అగ్ని ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇరువురు మృతి చెందారు. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో మీసాల ఈశ్వరరావు, ఖండవల్లి గ్రామంలో మొల్లేటి సత్యనారయణ కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించారు. ఈ మేరకు మంత్రి కందుల దుర్గేశ్ శనివారం వారి మృతదేహాలకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
Advertisement
Next Story