వైభవంగా జనార్ధనస్వామి రథోత్సవం

by Disha Web Desk 16 |
వైభవంగా జనార్ధనస్వామి రథోత్సవం
X

దిశ, కొత్తపేట: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నవ జనార్ధన ఆలయాల్లో ప్రముఖమైన ఆలమూరు భూ సమేత జనార్ధన స్వామి వారి దివ్య రథోత్సవం భక్తుల కోలాహలం మధ్య కన్నులపండువగా సాగింది. కరుణాంతరంగుడు, ఆర్త్రత్రాణపరాయణుడు అయిన ఆది నారాయణుడు భక్తసులభునిగా పవిత్ర గౌతమీ నదీ తీరాన జనార్ధనునిగా వెలిసిన ఆలమూరు దివ్యక్షేత్రంలో భీష్మ ఏకాదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయదేవేరులతో రథారూఢుడై తానే భక్తుల మధ్యకు తరలివచ్చి, దర్శనమిచ్చి అనుగ్రహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి గోవింద నామస్మరణతో రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.


Next Story

Most Viewed